ఉమ్మడి నార్నూర్ మండలంలోని తాగు నీటి సమస్య ఉన్న గ్రామాలకు కాంగ్రెస్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ పరిష్కారం పలుకుతున్నారు. శుక్రవారం గాదిగూడ మండలంలోని గణేష్ పూర్ గ్రామంలో సుగుణ చొరవతో నీటి బోరువేల్ వేశారు. దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. వారి సమస్యలను కాంగ్రెస్ పరిష్కరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో కనక హన్మంతరావు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.