ఆదిలాబాద్ పట్టణంలో గంజాయి విక్రయిస్తూ గతంలో పట్టుబడ్డ వారికి స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ గంజాయి విక్రయించవద్దని సూచించారు. ఒకవేళ మళ్లీ విక్రయిస్తూ పట్టుబడితే సస్పెక్ట్ షీట్ తెరిచి మరింత కఠినంగా శిక్షలు పడేలా చూస్తామని హెచ్చరించారు. విక్రయదారులపై నిరంతర నిఘా కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. డీఎస్పీ జీవన్ రెడ్డి ఉన్నారు.