ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల (బోథ్) డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులలో ఉన్న ఖాళీ సీట్లకు ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మీప్రసన్నగురువారం తెలిపారు. బిఎ, బీకాం (సిఎ), బిజెడ్సి, ఎంపీసీఎస్, డీఎస్ కోర్సులలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 15 లోపు కళాశాలలో నేరుగా హాజరుకావాలని ప్రిన్సిపాల్ సూచించారు.