ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న దృష్ట్యా రైతులు విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని ఏఈఓ ప్రణీత రైతులకు సూచించారు. భోరజ్ మండలం మాండగడలో శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు రసీదు తప్పనిసరి తీసుకోవాలని పేర్కొన్నారు. గుర్తింపు ఉన్న డీలర్ల వద్దని విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు. విత్తనాల జర్మినేషన్ చెక్ చేసుకోవాలని సూచించారు.