ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయం డిడి దిలీప్ కుమార్ ను ఆదివాసీ నేతలు కలిసారు. డిడి దిలీప్ కుమార్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఉట్నూర్ లో బుధవారం కలిసి శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి జిల్లా అద్యక్షులు పుర్క బాపురావ్, గోండ్వాన పంచాయతీ రాయిసెంటర్ జిల్లా మేడి మేస్రం దుర్గు, ఆదివాసి మహిళ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెందుర్ పుష్పరాణీ, ఆదివాసి ఉద్యమ సీనియర్ నాయకులు మర్సుకోల తిరుపతి ఉన్నారు.