బిజెపి సీనియర్ నేత, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మరణం తీరనిలోటని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. టిడిపి ప్రస్థానంలో రమేష్ రాథోడ్ తో కలిసి పంచుకున్న స్నేహపూర్వక సంబంధాలు ఎప్పుడు మరువలేనివని గుర్తు చేసుకున్నారు.