భారత సైనికులకు మద్దతుగా న్యాయవాదుల ర్యాలీ

53చూసినవారు
భారత సైనికులకు మద్దతుగా న్యాయవాదుల ర్యాలీ
ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా శుక్రవారం ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను చేతపట్టుకుని భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తించారు. పాకిస్థాన్‌పై భారత సైన్యం దాడులు జరుపుతున్న నేపథ్యంలో భారత సైన్యానికి, ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ అన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపడమే లక్ష్యంగా భారత్ సైనికులు పనిచేస్తున్నారని కొనియాడారు

సంబంధిత పోస్ట్