జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆడిటోరియంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అశోక్, డాక్టర్ శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ, ఐఎంఏ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలందిస్తున్న వైద్యులను సన్మానించనున్నట్లు పేర్కొన్నారు.