ఆదిలాబాద్ మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ భౌతికకాయానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అయన మృతి జిల్లా ప్రజలకు తీరని లోటని, రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రాథోడ్ రమేష్ అంచెలంచెలుగా ఎదిగి అనేక పదవులు చేపట్టి జిల్లా ప్రజలకు సేవ చేసారన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన అకాల మృతి కలిచివేసిందన్నారు.