పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసిఆర్ నిర్వహించిన రోడ్ షోలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి పలువురు పార్టీ నాయకులతో కలిసి మంచిర్యాల వెళ్లిన మున్సిపల్ చైర్మన్ శనివారం రాత్రి జరిగిన కేసిఆర్ రోడ్ షోలో పాల్గొన్నారు. చైర్మన్ వెంట పార్టీ నాయకులు జంగిలి ప్రశాంత్, కొండ గణేష్, సతీష్ తదితరులు ఉన్నారు.