మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ మృతి పార్టీకి తీరని లోటు అని ఆదిలాబాద్ జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు భార్గవ్ దేశ్పాండే అన్నారు. డీఎస్ మృతి పట్ల శనివారం ఓ ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గా ఉన్నపుడు వారి తో ఎన్. ఎస్. యూ. ఐ రాష్ట్ర అధ్యక్షులు గా పని చేయడం జరిగిందని వారితో ఉన్న అనుబంధాన్ని భార్గవ్ దేశ్పాండే గుర్తు చేసుకోన్నారు.