నార్నూర్: వేసవి శిబిరాన్ని పరిశీలించిన ఎంఈఓ

70చూసినవారు
నార్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కొనసాగుతున్న వేసవి శిబిరాన్ని శనివారం మండల విద్యాధికారి అనిత పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. శిబిరంలో చెస్, క్యారం, లూడో వంటి ఇండోర్ పోటీలతో పాటు ఏఐ తరగతులను అందుబాటులో ఉంచామన్నారు. దీంతో విద్యార్థులు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది వినోద్, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్