పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తెలిపారు. ఈనెల 31 లోపు సమర్పించని పక్షంలో ఏప్రిల్ మాసపు వేతనం నిలిపివేయడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. అదేవిధంగా ఈనెల 25న విశ్రాంత భవనంలో గుండె వైద్య శిబిరాన్ని ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పెన్షనర్లు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.