కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి మున్నూరు కాపు కులస్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తాలూకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కాళ్ల విఠల్ అన్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఆదిలాబాద్ వన్ టౌన్ లో ఫిర్యాదు చేశారు. కంది శ్రీనివాస్ రెడ్డి మున్నూరు కాపు కులస్తులైన గండ్రత్ సుజాత పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.