ఆదిలాబాద్ లోని ఖానాపూర్ సబ్ స్టేషన్ మరమ్మతుల నిమిత్తం శనివారం పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ సదానందం తెలిపారు. శనివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అశోక్ రోడ్, ఖానాపూర్, సోనార్ గల్లీ, బొక్కలగూడ, కొలిపుర్, మసూద్ చౌక్, దంగర్ గల్లీ, శాంతి నగర్ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులందరు సహకరించాలని కోరారు.