ఆదిలాబాద్ లోని రైల్వే అండర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి అయ్యేటట్లు చూడాలని రైల్వే డిఆర్ఎం నీతి సర్కార్ ను ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమెకు రైల్వే సమస్యలపై విన్నవించారు. ఈ సందర్భంగా స్థానిక తాంసి బస్టాండ్ వద్ద రైల్వే గేటు వద్ద ఆర్ఓబి స్థలాన్ని పరిశీలించారు. స్థానిక రైల్వే గేట్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ ఆర్ఓబి పనులను త్వరగా చేపట్టాలని కోరారు.