రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న భూభారతి సదస్సుతో ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని ఏఎంసీ చైర్మన్ విశ్వనాధ్ పేర్కొన్నారు. శుక్రవారం సిర్పూర్(యు) మండలంలోని పాములవాడలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో ఆయన హాజరై మాట్లాడారు. రైతులు తమ సమస్యలపై భుసదస్సులో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ ప్రహ్లాద్, ఎస్ఐ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.