కార్మికుల సమస్యలను పరిష్కరించండి

64చూసినవారు
కార్మికుల సమస్యలను పరిష్కరించండి
కార్మికుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని ఆదిలాబాద్ బల్దియా కమిషనర్ సీవీఎన్ రాజును మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) అధ్యక్షుడు దర్శనాల నాగేశ్, ప్రధాన కార్యదర్శి స్వామి కోరారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కమిషనర్ రాజును యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సత్కరించారు. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఆయనకు విన్నవించారు. కార్మికులు జనార్ధన్, ప్రసాద్, శీను, రాకేశ్, హనుమాన్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్