మంత్రి సీతక్కపై కాంగ్రెస్ కాగజ్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మన్ ఆనంద్ రావు అన్నారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆదివాసి నాయకులతో కలిసి పాల్గొని ఆయన మాట్లాడారు. మంత్రి సీతక్కకు వెంటనే రావి శ్రీనివాస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.