ఈ నెల 3వ నుంచి డిజిటల్ కార్డుల సర్వేను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆన్నారు. బుదవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఇవ్వాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్ వార్డు, గ్రామ పంచాయతీని ఫైలెట్ ప్రాజెక్ట్ గా సర్వే బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈనెల 8 తేదీ వరకు సర్వే పూర్తి చేయాలన్నారు.