ఆదిలాబాద్లో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై.. ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం గజగజ వణికిపోతున్నారు. మంగళవారం ఆదిలాబాద్లో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శీతలగాలుల నేపథ్యంలో ఇప్పటికే ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.