ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థలలో అధిక ఫీజుల దోపిడిని అధికారులు అరికట్టాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవిపి) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొట్టూరి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అనుమతి లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.