భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు రూ. 5 వేల పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఈనెల 21, 22 తేదీలలో నిర్వహించనున్న సంఘం రాష్ట్ర 4వ మహాసభలను వాల్ పోస్టర్లను ఆదిలాబాద్ ఏఐటీయూసీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మహాసభలకు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.