తన వాహనంలో ప్రయాణించే ప్రయాణికు లను మచ్చిగా చేసుకుని దొంగతనాలకు పాల్పడిన దొంగను ఆదిలాబాద్ టూ టౌన్ ఐడి పార్టీ పోలీసులు పట్టుకున్నారు. గురువారం డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు. రూరల్ మండలం చిచ్ దరి ఖానాపూర్ కు చెందిన యువరాజ్ ప్రయాణికులను నమ్మించి వారి బ్యాగులను కొట్టేసేవారు అని తెలిపారు. సీఐ కరుణాకర్, ఫణిదర్, ఎస్ఐ విష్ణువర్ధన్, సిబ్బంది రమేష్, నరేష్, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.