మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ అకాల మరణం బీజేపీకి తీరని లోటని ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వారు పుష్పాంజలి ఘటించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, అదినాథ్, రమేష్, జోగు రవి, దినేష్ మాటోలియా, రాజేష్, తదితరులు ఉన్నారు.