ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిత్య నగర్ కాలనీలో గల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీలత పదోన్నతి పై బదిలీ కావడంతో స్థానిక కౌన్సిలర్ పవన్ నాయక్ ఆధ్వర్యంలో కాలనీవాసులు ఆమెను బుదవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కోసం ఆమె అందించిన సేవలను కొనియాడారు. అహర్నిశలు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆమె కృషి చేశారని పేర్కొన్నారు. కాలనీవాసులు విలాస్, కలీం, జహీర్, వంశి, పాల్గొన్నారు.