
ఇరాన్లోని భారతీయులకు అడ్వైజరీ
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని భారతీయులకు అక్కడి మన రాయబార కార్యాలయం పలు సూచనలు జారీ చేసింది. ' ఇరాన్లోని భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలి. అనవసర ప్రయాణాలు మానుకోవాలి. స్థానిక అధికారులు సూచించిన భద్రతా నిబంధనలు పాటించాలి' అని తెలిపింది. తాజా వివరాల కోసం ఓ టెలిగ్రామ్ లింక్ను షేర్ చేసింది. హెల్ప్లైన్ నంబర్లను పోస్ట్ చేసింది.