భారత్ సైన్యం కోసం ఆదిలాబాద్ పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ మార్వాడి ధర్మశాల బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత సైన్యానికి మంచి విజయాలు ప్రసాదించాలంటూ శుక్రవారం స్వామివారికి అభిషేకం, అర్చన కార్యక్రమాలను భక్తులతో కలిసి చేపట్టారు. కాశ్మీర్ లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేశారు.