మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడలో ఘట్టం రాజు ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై బుధవారం పోలీసులు దాడి చేశారు. తమకు అందిన సమాచారంతో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ సిబ్బందితో దాడి చేసి ఘట్టం రాజు, దొడ్ల శ్రీనివాస్, మఠం రాజు, జాబర్ శ్యామ్ రావు, సమ్మయ్య ను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 30050 నగదు, 3 మొబైల్ ఫోన్స్ సాధన చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.