ఆదిలాబాద్ షీ టీం బృందాలు మహిళలకు, యువతులకు రక్షణగా ఉంటూ వేధింపులకు గురి చేసిన వారిని పట్టుకుని కేసులు నమోదు చేసినట్లు శనివారం బోథ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బోథ్ కు చెందిన యువతిని నిర్మల్ కి చెందిన సాయి స్నాప్ చాట్ లో వేధింపులకు గురించేసేవాడని ఫిర్యాదు చేసింది. దీంతో షీ టీం బృందం అతడిని బోథ్ కు రప్పించి అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.