అడవి పంది దాడిలో ఒకరు మృతి చెందిన ఘటన ఇంద్రవెల్లిలో శనివారం చోటుచేసుకుంది. దొడంద గ్రామపంచాయతీ పరిధిలోని చిల్లటీగూడ గ్రామానికి చెందిన మడావి బొజ్జు శుక్రవారం సాయంత్రం మేకలను మేపుతుండగా అడవి పంది దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన బొజ్జు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.