ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, గుడిహత్నూర్ మండల సరిహద్దులు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం తోషం ధనోరా సమీపంలో కారు, టాటా ఏసీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో టాటా ఏసీ బోల్తాపడగా.. కారు ముందు భాగం డ్యామేజ్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సింది.