
జేఈఈ మెయిన్స్ సెషన్-2 ఫైనల్ కీ విడుదల
జేఈఈ మెయిన్స్ సెషన్-2కు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి. ఫైనల్ ‘కీ’ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అభ్యర్థులు https://jeemain.nta.nic.in/ వెబ్సైట్ ద్వారా ఫైనల్ ఆన్సర్ కీ, స్కోర్ కార్డ్, ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెషన్ 1, 2లో అర్హత సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది మే 18న జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష జరగనుంది.