జిల్లాలో రానున్న 2, 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బోథ్ నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మంగళవారం సూచించారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్ష సూచన ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎత్తయిన ప్రాంతాలకు చేరుకోవాలని అవసరం అయితే తప్ప ఎవరూ బయటికి రావొద్దని ఇలాంటి సమయాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.