బోథ్: రోహింగ్యాలను గుర్తించి వారి దేశాలకు పంపాలి

83చూసినవారు
బోథ్: రోహింగ్యాలను గుర్తించి వారి దేశాలకు పంపాలి
భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యలను గుర్తించి వెంటనే వారి దేశాలకు పంపాలని తలమడుగు మండల బీజేపీ అధ్యక్షుడు బోనగిరి స్వామి అన్నారు. శుక్రవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో తలమడుగు తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అక్రమంగా దేశంలో నివసిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం అధ్యక్షుడు కిరణ్, మండల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్