ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సభను పక్కదోవ పట్టించేల మహిళలను కించపరిచే విధంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ బోథ్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గురువారం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ రెడ్డి, సురేందర్ యాదవ్, శ్రీధర్ రెడ్డి, మల్లెపూల సుభాష్, తదితరులు పాల్గొన్నారు.