ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహాయ సహకారాలు అందించాలని తలమడుగు జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఝరి, పూనగూడా ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విలాస్ గౌడ్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమయ్యే సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీతో పాటు మండల విద్యాధికారి నారాయణ పాల్గొని విద్యార్థులకు పరీక్ష సామగ్రిని అందజేశారు. మంగళవారం ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఉన్నారు.