వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ మనోహర్ అన్నారు. ఇచ్చోడ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రి రికార్డులను , పరిసరాలను, మందుల నిల్వలను పరిశీలించారు. వైద్య సేవల గురించి ఆసుపత్రికి వచ్చిన రోగులతో ఆరా తీశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.