నేరడిగొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం వడ్డాడి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీకి పలు నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్ వారిని కండువా కప్పి ఆహ్వానించారు. చేరిన వారిలో ఇస్మాయిల్ ఖాన్, నవనీత్ రెడ్డి, రాజన్న, రమేష్ తదితరులు ఉన్నారు.