భీంపూర్ మండలంలోని ఈదుల్లా సవర్గామ్- పిప్పల్ కోటి, నిపాని మార్గంలో శుక్రవారం కురిసిన వర్షాలకు వాగులు పొంగి లోతట్టు వంతెనల మీదుగా వరద నీరు పారింది. దీంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ ఉన్న మత్తడివాగు గేట్లు ఎత్తడంతో వరద నీరు దిగువ వాగుల్లోకి పారడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వాగు వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీసులు పర్యవేక్షించారు.