ఆశ కార్యకర్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల నెరవేర్చాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎమ్మెల్యేను గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఆశ కార్యకర్తలు కలిసి వినతి పత్రం సమర్పించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై ప్రస్తావించాలని కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు.