జైపూర్ లో సింగరేణి తవ్విన గుంతలో పడి బాలుడి మృతి

80చూసినవారు
జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన చిప్పకుర్తి రాజకుమార్ (15) ప్రమాదవశాత్తు సింగరేణి సంస్థ తీసిన గుంతలో పడి మృతి చెందాడు. సింగరేణి పవర్ ప్లాంట్ కోసం చుట్టుపక్కల గ్రామాల్లో మట్టి తవ్వకాలు జరిపారు. అనంతరం గుంతలు పూడ్చలేదు. తండ్రికి భోజనం తీసుకొని గుంతల పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా కాలుజారి గుంతలో పడ్డాడు. స్థానికులు గమనించి గుంతలోంచి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్