మంచిర్యాల పట్టణంలోని ఓ లాడ్జిలో వ్యభిచారం నడుస్తుందన్న సమాచారం రావడంతో మంగళవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు విటులు, లాడ్జీ ఓనర్, మేనేజర్తో సహా 8 మందిని అరెస్ట్ చేసినట్లు సీఐ బల్సీలాల్ తెలిపారు. ఇటీవల బెల్లంపల్లిలో ఇలాగే ఆరు జంటలను పట్టుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం న్యాయస్థానంలో ప్రవేశపెట్టినట్లు సీఐ వివరించారు.