నిర్మల్ జిల్లా బాసరలోని గోదావరిలో స్నానానికి దిగి మృతి చెందిన యువకుల సంఖ్య ఐదుకి చేరింది. గల్లంతైన మరో యువకుడి ఆచూకీ కూడా దొరికింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు. వారిని హైదరాబాద్లోని చింతల్కు చెందిన రాకేశ్, వినోద్, మదన్, రుతిక్, భరత్గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.