దుబాయ్ లో నిర్మల్ జిల్లా వాసి మృతి

72చూసినవారు
దుబాయ్ లో నిర్మల్ జిల్లా వాసి మృతి
సారంగాపూర్ మండలంలోని మలక్ చించోలి గ్రామానికి చెందిన కుర్మే దేవన్న అలియాస్ జడ్ల దేవన్న అనే వ్యక్తి గుండెపోటుతో దుబాయ్ లోని హల్కస్ ఏరియా లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. దేవన్న గత 30 సంవత్సరాలుగా బతుకుదెరువు కోసం దుబాయ్ లోనే పనిచేస్తున్నాడని మూడు నెలల క్రితం ఇంటికి వచ్చి వెళ్ళాడని బుధవారం రాత్రి సమయంలో గుండెపోటు వచ్చినట్లు అతని గదిలో ఉండే స్నేహితులు ఫోన్ చేసి తెలిపారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నిరుగా విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్