ముంబయి విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ భారత్లోని అఫ్గానిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్ధక్ ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. దుబాయ్ నుంచి భారత్కు తరలిస్తుండగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ సుమారు రూ.18.6 కోట్లు. ఈ ఘటన గత నెల 25న జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జకియా శనివారం తన పదవికి రాజీనామా చేశారు.