సైనిక చర్యను నిలిపివేయడంపై ఒప్పందం కుదిరింది: జైశంకర్

62చూసినవారు
సైనిక చర్యను నిలిపివేయడంపై ఒప్పందం కుదిరింది: జైశంకర్
భారత్‌- పాకిస్థాన్‌ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేసే విషయంలో పరస్పర అవగాహనకు వచ్చాయని భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్‌, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్‌ పలు భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నించగా, భారత్‌ కూడా సమర్థంగా తిప్పికొట్టింది.

సంబంధిత పోస్ట్