ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్‌

71చూసినవారు
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్‌
టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా విమానయాన సంస్థ తన బ్యాగేజీ పాలసీని మార్చింది. దేశీయ విమాన ప్రయాణాలకు ఫ్రీ బ్యాగేజీపై ఉన్న గరిష్ఠ పరిమితిని తగ్గించింది. తక్కువ ధర టికెట్‌ ప్రయాణానికి గతంలో 20 కేజీలుగా ఉన్న బ్యాగేజీని 15 కేజీలకు కుదించింది. ఎకానమీలో కంఫర్ట్‌, కంఫర్ట్‌ ప్లస్ ఫేర్‌ కేటగిరీ టికెట్లు ఉన్నవారికి ఇకపై 15 కేజీలు మాత్రమే చెక్‌-ఇన్‌ బ్యాగేజీకి అనుమతిస్తారు. ఈ కొత్త రూల్స్‌ మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్