ఎయిరిండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. పూణె ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తున్నవిమానం.. రన్వేపై లగేజీ ట్రాక్టర్ను ఢీకొట్టింది. టగ్ ట్రాక్టర్ను ఢీకొనడం వల్ల విమానం ముక్కు భాగం డ్యామేజ్ అయింది. ల్యాండింగ్ గెయిర్కు చెందిన టైరు కూడా స్వల్పంగా దెబ్బతింది. భారీగానే ట్రాక్టర్ను ఢీకొట్టినా.. విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.