పాక్, భారత్ మధ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో నిన్న ధర్మశాలలో జరిగిన మ్యాచ్ను మధ్యలోనే నిలిపివేసిన సంగతి తెలిసిందే. స్థానికంగా విమానాశ్రయాలను మూసివేయడంతో PBKS, DC ఆటగాళ్లు ధర్మశాల నుండి రోడ్డు మార్గంలో జలంధర్ చేరుకున్నారు. ఆ తర్వాత వారు జలంధర్ నుంచి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ రైల్వే స్టేషన్కు వందేభారత్ రైలులో చేరుకున్నారు. తక్కువ సమయంలో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిన భారత రైల్వేస్కు IPL యాజమాన్యం అభినందనలు తెలిపింది.